ETV Bharat / city

ఆ​ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోండి.. వెంకయ్యనాయుడికి గ్రామస్థుల వినతి

author img

By

Published : Oct 4, 2022, 8:32 PM IST

వెంకయ్య నాయుడుకి వినతి పత్రం
Request to Ex Vice President

కరోనాకు ముందువరకు ఆ ప్రాంతంలో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగేవి. ప్రస్తుతం అక్కడ ఎక్స్​ప్రెస్​ రైళ్లను ఆపడం లేదు. ఆ ప్రాంత ప్రజలు అనేకసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు.

కరోనకు ముందు ఆ ప్రాంతంలో కృష్ణా, పూరి, తిరుమల, మచిలీపట్నం ఎక్సప్రెస్ రైళ్లు ఆగేవి. కరోనా అనంతరం పరిమాణాలు మారిపోయాయి. గతంలో మాదిరిగా అక్కడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలుపుదల చేయడం లేదు. ఆ ప్రాంత ప్రజలు అధికారుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకుండాపోయింది. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం జాయంపులోని వెందొడు రైల్వే స్టేషన్​లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలుపుదల చేయించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు విజ్ఞాపన పత్రం ఇచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం పర్యటనలో వెంకటగిరి బీజేపీ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఈ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. స్పందించిన వెంకయ్య నాయుడు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపినట్లు ఎస్ఎస్ఆర్ నాయుడు తెలిపారు.

ఇవీ చదంవడి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.