ETV Bharat / city

YCP Vs PAWAN: 'కాల్​షీట్స్​ లేకపోతేనే పవన్​కు ప్రజలు గుర్తొస్తారు'

author img

By

Published : Oct 1, 2021, 2:54 PM IST

Updated : Oct 1, 2021, 3:30 PM IST

తిరుమల శ్రీవారిని మంత్రి శంకరనారాయణ దర్శించుకున్నారు. సినిమాల కాల్‌షీట్లు లేకపోతేనే పవన్‌ కల్యాణ్‌ ప్రజల్లోకి వస్తారని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజలంతా సంతోషంగా ఉన్నారని.. వారు ఏ పార్టీ వైపు చూడట్లేదని చెప్పారు. రహదారులపై ఏదో చేసి హడావిడి చేయాలనేది జనసేన ఆలోచన అని విమర్శించారు. వర్షాలు తగ్గగానే రహదారులకు మరమ్మతులు చేపడతామని మంత్రి శంకరనారాయణ తెలిపారు.

Minister Sankaranarayana
సినిమాలు లేకపోతేనే పవన్ ప్రజల్లోకి వస్తారు

పవన్ కల్యాణ్ సినిమాలకు కాల్​షీట్స్ లేకపోతేనే ప్రజల్లోకి వస్తారని మంత్రి శంకర్ నారాయణ ఎద్దేవా చేశారు. ప్రజలందరూ సంతోషంగా జీవిస్తూ ఏ రాజకీయ పార్టీల వైపు చూడడం లేదన్నారు. రహదారులపై ఏదో చేస్తే ప్రజల్లో గుర్తింపు వస్తుందనే నీచపు ఆలోచనతో జనసేన ఉందని విమర్శించారు. గత ప్రభుత్వం హయాంలో రహదారుల నిర్వహణ సరిగా లేదన్న మంత్రి... వర్షాలు తగ్గిన వెంటనే మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు.

రాజధానిలో అమరావతి రైతులు బూటకపు ఉద్యమాలు చేస్తున్నారని.. షెడ్లు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని ప్రజలు తెదేపాకు వ్యతిరేకంగా ఉన్నారనడానికి మంగళగిరి ఎన్నికలే నిదర్శనమన్నారు.

వీఐపి ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి మంత్రి శంకర్ నారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి :

Kanipakam Laddu: కాణిపాకం వినాయకుడి లడ్డూ ఎంతో తెలుసా?

Last Updated : Oct 1, 2021, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.