ETV Bharat / city

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, నలుగురికి గాయాలు

author img

By

Published : Jan 19, 2021, 8:43 PM IST

jeep accident
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి , నలుగురికి గాయాలు

తిరుపతి జూపార్కు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా .. నలుగురికి గాయాలయ్యాయి. జీపు అదుపు తప్పి రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది.

తిరుపతి జూపార్కు సమీపంలో జీపు అదుపుతప్పి రెండు బైకులను ఢీకొట్టి కల్వర్టులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చెర్లోపల్లి-అలిపిరి మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఎమ్మెల్యే రోజా ఆవేదన.. తనకు రావాల్సిన వాటాల కోసమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.