ETV Bharat / city

వైభవంగా శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం

author img

By

Published : Mar 14, 2022, 5:12 AM IST

Theppotsavam at Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర ఉత్సవమూర్తులు తెప్పపై విహరిస్తూ.. భక్తులకు అభయ ప్రదానం చేశారు.

Srivari Salakat Theppotsavam
శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున తెప్పోత్సవాలను ప్రారంభించి పౌర్ణమి వరకు తితిదే నిర్వహిస్తుంది. తెప్పోత్సవాలలో భాగంగా తొలిరోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర ఉత్సవమూర్తులను తిరువీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. కోనేరులో విద్యుద్దీపాలు, పుష్పాలతో అలంకరించిన తెప్పపై స్వామివారు దర్శనమిచ్చారు. తెప్పపై మూడు సార్లు విహరిస్తూ.. స్వామివారు భక్తులకు అభయమిచ్చారు.

ఇదీ చదవండి:

శ్రీవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు.. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బారులు తీరిన వాహనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.