ETV Bharat / city

గుర్తు తెలియని యువకుని హత్య.. పోలీసుల దర్యాప్తు

author img

By

Published : Jul 21, 2020, 10:59 PM IST

నెల్లూరులో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. స్థానిక రేబాల వీధిలోని సబ్​స్టేషన్​ వద్ద యవకుని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

unknown person died in nellore town sub station and police cased file
రేబాలవారివీధీ సబ్​ స్టేషన్ వద్ద మృతదేహం లభ్యం

నెల్లూరులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని రేబాలవారివీధి సబ్​ స్టేషన్​ దగ్గర ఖాళీ స్థలంలో యువకుని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. యువకుణ్ని మారణాయుధాలతో దారుణంగా కొట్టి చంపినట్లు గుర్తించారు. వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లు అనుమానిస్తున్నారు. మృతుని వయసు 30 నుంచి 35 ఏళ్లు ఉండొచ్చని తెలిపారు. ఘటనపై నవాబ్​పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ట్రాక్టర్‌ గోతిలో పడి...డ్రైవర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.