ETV Bharat / city

రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

author img

By

Published : May 29, 2022, 8:30 PM IST

Road Accident: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పీజీ సెంటర్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

Road Accident in Kavali
Road Accident in Kavali

Road Accident: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పీజీ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక బైక్ వై ఉన్న వ్యక్తి మరణించారు. మరొక బైక్ పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

రెండు బైకులు ఢీ...ఒకరు మృతి,మరొకరికి పరిస్థితి విషమం..

వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి? : తీవ్రంగా గాయపడిన సురేష్ అనే వ్యక్తి.. కావలి ఏరియా ఆసుపత్రికి తరలించిన తర్వాత మృతి చెందాడు. అయితే.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సురేష్ మృతిచెందాడని బంధువుల ఆరోపించారు. అత్యవసర వైద్య విభాగంలో సమయానికి సరైన చికిత్స అందించలేదని, కనీసం ఆక్సిజన్ కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఆక్సిజన్ పెట్టాలని గట్టిగా అడిగిన తర్వాతనే వైద్యులు స్పందించారని ఆరోపించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.