ETV Bharat / city

నకిలీ కరోనా మందు విక్రయం.. పోలీసుల అదుపులో నిందితుడు

author img

By

Published : Jul 25, 2021, 8:24 AM IST

ఆనందయ్య శిష్యుడినని చెప్పుకుంటూ నకిలీ మందును విక్రయించిన ఓ వ్యక్తిని ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మందును హైదరాబాద్​కు చెందిన మానవ హక్కుల సంఘం ప్రతినిధులకు ఆ వ్యక్తి విక్రయించాడని పోలీసులు తెలిపారు.

counterfeit-corona-drug
నకిలీ కరోనా మందు

ఆనందయ్య మందు పేరిట నకిలీ ఔషధాన్ని విక్రయించిన ఓ వ్యక్తిని ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మందును స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌కు చెందిన మానవ హక్కుల సంఘం ప్రతినిధులు ఆనందయ్య మందు కావాలంటూ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన సురేష్‌ అనే వ్యక్తిని సంప్రదించారు. ఆనందయ్య శిష్యుడిగా చెప్పుకుంటున్న సురేష్‌ అనే యువకుడు 10 కిలోల మందు లక్షా 20వేల రూపాయలకు బేరం పెట్టాడు.

మందు తీసుకొని ఒంగోలు వచ్చి ఒప్పందం చేసుకున్నారు. మందు తీసుకుంటున్న సమయంలో నకిలీ మందుగా భావించిన ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: పొంచి ఉన్న మూడో దశ ముప్పు... ముందు జాగ్రత్తగా ఆనందయ్య మందు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.