ETV Bharat / city

Two Groups Clashes: ఆలయ బ్రహ్మోత్సవాల్లో యువకుల ఘర్షణ.. పలువురికి గాయాలు

author img

By

Published : Apr 14, 2022, 12:19 PM IST

Clashes between two groups
రెండు వర్గాల మధ్య ఘర్షణ

Clashes between two groups: బుచ్చిరెడ్డిపాలెంలోని కోదండరామ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి.

Clashes between two groups: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని కోదండరామ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో కొందరు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఖాజానగర్, శాంతినగర్ ప్రాంతాలకు చెందిన యువకులు ఉత్సావాలు తిలకించేందుకు ఆలయానికి వచ్చారు. వీరి మధ్య మాటామటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల యువకులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకోవడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పొలానికి వెళ్తుండగా.. కాలువలో పడి రైతు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.