ETV Bharat / city

కడప: ఆదిరెడ్డిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

author img

By

Published : Oct 21, 2021, 5:48 PM IST

Updated : Oct 21, 2021, 8:00 PM IST

కడప జిల్లాలోరోడ్డు ప్రమాదం
కడప జిల్లాలోరోడ్డు ప్రమాదం

17:45 October 21

కూలీలపైకి దూసుకెళ్లిన ప్రొక్లెయినర్‌

కడప జిల్లా మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లి(kadapa district adhireddypalli) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి(three people died in road accident) చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆస్పత్రికి(government hospital) తరలించారు. రోడ్డుపై నిలబడి ఉన్న కూలీలపై జేసీబీ ప్రొక్లెయినర్ దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన వారందరూ కేశిలింగాయపల్లి(keshilingayapalli) గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు... జేసీబీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు(case) నమోదు చేసుకుని దర్యాప్తు(inquiry) చేపట్టారు. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. 

ఇవీచదవండి.

Last Updated : Oct 21, 2021, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.