ETV Bharat / city

'నగరంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా పనిచేస్తాం'

author img

By

Published : Apr 6, 2021, 9:17 PM IST

kadapa corporation council meeting
కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం

నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పనిచేస్తామని కడప నగరపాలక సంస్థ మేయర్ సురేశ్ బాబు అన్నారు. కార్పొరేషన్ తొలి సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు.

కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని మేయర్ సురేశ్ బాబు అన్నారు. ఆయన అధ్యక్షతన పాలకవర్గం తొలి సర్వసభ్య సమావేశం జరిగింది. నగరంలో చేపట్టే వివిధ పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా పనిచేస్తామని మేయర్ అన్నారు.

నగరంలో ఇప్పటికే రూ. 700 కోట్లతో అనేక అభివద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్​లోని ట్యాంక్ బండ్ తరహాలో దేవునికడప చెరువును మినీ ట్యాంక్ బండ్​గా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు మేయర్ వెల్లడించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, కార్పొరేటర్లు హాజరయ్యారు.

ఇదీ చూడండి:

పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టు స్టే: తదుపరి కార్యాచరణపై సీఎం చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.