ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 5pm

author img

By

Published : Dec 22, 2021, 4:58 PM IST

.

ప్రధాన వార్తలు @ 5pm
ప్రధాన వార్తలు @ 5pm

  • వీధిరౌడీల్లా అశోక్ గజపతిరాజుపై.. మంత్రులు దాడికి తెగించారు: చంద్రబాబు
    Chandrababu Fires On Ministers: రామతీర్థం ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజుపై మంత్రులు దాడికి తెగించారని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అశోక్ గజపతిరాజుపై కక్షగట్టారని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • జగదీశ్వరుడి ఆరోపణల్లో వాస్తవం లేదు: వెంకటేశ్వరరావు
    Venkateshwara Rao Denied allegations against him: స్థిరాస్తి వ్యాపారి జగదీశ్వరుడు సామాజిక మాధ్యమాల్లో తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని.. విశాఖ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు అన్నారు. అతను అప్పుల పాలై పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అజయ్​ జైన్​తో ఉద్యోగ సంఘాల భేటీ.. ఈ సమస్యలపైనే చర్చ
    ap employees union leaders meets Ajay Jain: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ విడివిడిగా భేటీ అయ్యారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ప్రొహిబిషన్ డిక్లరేషన్​ ప్రక్రియన వేగవంతం చేయాలని కోరినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • OMICRON CASE IN HYDERABAD : హైదరాబాద్​లో ఒమిక్రాన్ కలకలం.. మరో కేసు నమోదు
    OMICRON CASE IN HYDERABAD : తెలంగాణలో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్‌లో 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధరణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • '21 ఏళ్లలోపు వారి పెళ్లికి హైకోర్టు నో.. సహజీవనానికి ఓకే!'
    Live In Relationship Punjab And Haryana High Court: పంజాబ్ హరియాణా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 21ఏళ్ల కంటే తక్కువ వయసున్న అబ్బాయిలు వివాహం చేసుకోరాదు కానీ.. 18ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న యువతితో లివ్ ఇన్ రిలేషన్​షిప్​లో ఉండొచ్చని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'బూస్టర్ డోసు ఎప్పుడు పంపిణీ చేస్తారు?'
    Rahul Gandhi Vaccine Twitter: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసుపై కేంద్రాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇంకా.. 60 శాతానికి పైగా జనాభాకు టీకా అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ట్విట్టర్ అల్గారిథం పక్షపాతం- మితవాద ట్వీట్లకే అనుకూలం!Twitter prejudice algorithm: పర్సనలైజ్డ్ కంటెంట్ అందించేందుకు ట్విట్టర్ ఉపయోగిస్తున్న అల్గారిథం మితవాదులకు అనుకూలంగా ఉందని పరిశోధకులు తేల్చారు. మితవాత రాజకీయ నాయకులు, వార్తా సంస్థల ట్వీట్లు ఎక్కువ మందికి కనిపించేలా అల్గారిథం యాంప్లిఫై చేసిందని గుర్తించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Zee Sony Merger: జీ-సోనీ విలీనం ఖరారు.. సీఈఓ ఎవరంటే..?
    Zee Sony Merger: దేశంలోనే అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌గా జీ-సోనీ విలీన సంస్థ అవతరించనుంది. ఈ మేరకు సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా(ఎస్పీఎన్​ఐ), జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జీఈఈఎల్​) మధ్య ఒప్పందం ఖరారైంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'అదే జరిగితే టీమ్​ఇండియాను వెనక్కి పంపిస్తాం'
    Teamindia vs South Africa: ఓమిక్రాన్​ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు పకడ్బంధీగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకవేళ భారత ఆటగాళ్లు అనారోగ్యానికి గురైతే తక్షణమే వారికి వైద్య సహాయం అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇంకా పలు జాగ్రత్తలు కూడా తీసుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రామోజీ ఫిల్మ్​సిటీలో 'రాధేశ్యామ్' ప్రీ రిలీజ్.. హోస్ట్​గా యువహీరో
    Radhe shyam movie: 'రాధేశ్యామ్' ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చే అభిమానులకు గుడ్​న్యూస్. ఎంట్రీ పాస్​లు ఉచితంగానే ఇస్తున్నామని నిర్మాణ సంస్థ పేర్కొంది. అలానే తెలుగు యువహీరో ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.