ETV Bharat / city

ఈఎస్​ఐ కేసులో ముగిసిన మూడు రోజుల విచారణ

author img

By

Published : Jun 27, 2020, 1:42 PM IST

Updated : Jun 27, 2020, 2:32 PM IST

ఈఎస్‌ఐలో కొనుగోళ్ల ఆరోపణలకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ అధికారులు మూడో రోజు విచారణ ముగిసింది. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అధికారులు మూడు రోజులు ప్రశ్నించారు.

acb-enquiry-on-acchennaidu-in-third-day
అచ్చెన్నపై కొనసాగుతున్న మూడో రోజు అనిశా విచారణ

ఈఎస్‌ఐలో కొనుగోళ్ల వ్యవహారంలో... అనిశా అధికారులు మాజీ మంత్రి అచ్చెన్నాయుడును మూడో రోజూ ప్రశ్నించారు. మొదటి రోజు మూడు గంటలు, రెండో రోజు 5 గంటలు విచారణ జరిపిన అధికారులు.. మూడో రోజూ మూడు గంటల పాటు ప్రశ్నించారు.

టెలీ హెల్త్‌కు సంబంధించిన వ్యవహారంలో కంపెనీకి సిఫారసు చేస్తూ సంతకాలు పెట్టారంటే.... ఆ కంపెనీకి టెండర్లు ఇవ్వాలని చెప్పడమే కదా అంటూ అనిశా అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది. కొనుగోలు సమయానికి తాను మంత్రిగా లేనని.. కొనుగోలు దస్త్రాలేవి తన దగ్గరకు రాలేదంటూ అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడు రోజుల విచారణ నేటితో ముగిసింది.

ఇవీ చదవండి:

అచ్చెన్నపై కొనసాగుతున్న రెండోరోజు అనిశా విచారణ

Last Updated : Jun 27, 2020, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.