ETV Bharat / city

ఏలూరులో తగ్గుముఖం పట్టిన వింతవ్యాధి బాధితుల సంఖ్య

author img

By

Published : Dec 13, 2020, 12:45 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధితో అస్వస్థతకు గురైన వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24గంటల్లో ఇద్దరు మాత్రమే ఆసుపత్రిలో చేరారు. మరో ఏడుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Decline in the number of elusive disease victims in Eluru at west godavari
ఏలూరులో తగ్గుముఖం పట్టిన వింతవ్యాధి బాధితుల సంఖ్య

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 24గంటల్లో ఇద్దరు మాత్రమే అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా... వారు కూడా కోలుకున్నారు. వారం రోజుల వ్యవధిలో వింత వ్యాధి కేసుల సంఖ్య 612కు చేరుకొంది. ఇందులో 605మంది కోలుకున్నారు. ఏలూరులో ఇద్దరు, విజయవాడలో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వైద్యాధికారులు అన్ని ప్రాంతాల్లో వైద్యశిబిరాలను కొనసాగుస్తున్నారు.

ఇదీ చదవండి:

'మరణించిన మహిళపై కేసులా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.