ETV Bharat / city

'మృతదేహం ఇంటికి పంపిన తర్వాత.. మళ్లీ తీసుకెళ్లడమెందుకు?'

author img

By

Published : Dec 7, 2020, 8:12 PM IST

Updated : Dec 7, 2020, 9:05 PM IST

'మృతదేహం ఇంటికి పంపిన తర్వాత.. మళ్లీ తీసుకెళ్లడమెందుకు?'
'మృతదేహం ఇంటికి పంపిన తర్వాత.. మళ్లీ తీసుకెళ్లడమెందుకు?'

ఏలూరులో వింత వ్యాధితో మృతి చెందిన శ్రీధర్​ మృతదేహం వివాదంపై చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చిన మృతదేహాన్ని మళ్లీ పోస్టుమార్టం కోసం ఎందుకు తీసుకెళ్లారని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఏలూరులో వింత వ్యాధితో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఆ వ్యాధితో నిన్న శ్రీధర్ అనే వ్యక్తి మృతి చెందారు. శ్రీధర్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. మళ్లీ పోస్టుమార్టం చేయలంటూ.. మృతదేహం కోసం ఇంటికి వెళ్లారు. ఈ విషయంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం చేశాకే మృతదేహాన్ని ఇస్తారని.. మళ్లీ ఎందుకు తీసుకెళ్లడం అంటూ ఆవేదన చెందారు. దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్​లో పోస్టు చేశారు.

'మృతదేహం ఇంటికి పంపిన తర్వాత.. మళ్లీ తీసుకెళ్లడమెందుకు?'

ఇదీ చదవండి: 'సీఎం ఏలూరు పర్యటనలో పెళ్లి వేడుకకే ప్రాధాన్యం ఇచ్చారు'

Last Updated :Dec 7, 2020, 9:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.