ETV Bharat / city

రైతుల ఖాతాల్లో 1252 కోట్ల పంటల బీమా సొమ్ము జమ

author img

By

Published : Dec 15, 2020, 1:05 PM IST

Updated : Dec 15, 2020, 3:31 PM IST

వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు. కలెక్టర్లు, లబ్ధిదారులతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రూ.1,252 కోట్ల బీమా సొమ్మును రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 2019 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు పరిహారం అందించనున్నారు.

cm jagan
cm jagan

రైతుల ఖాతాల్లో 1252 కోట్ల పంటల బీమా సొమ్ము జమ

పంట నష్టపోతే బీమా పరిహారం ఆదుకొంటుందన్న నమ్మకం రైతుల్లో పెంచేందుకే వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. కలెక్టర్లు, లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... 12వందల 52 కోట్ల బీమా సొమ్ము రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు చెప్పారు. 2019 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు సైతం పరిహారం అందిస్తున్నామన్నారు. రైతులకు నష్టం లేకుండా బీమా సొమ్ము అందించాలన్నదే తమ లక్ష్యం అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పంట నష్టం జరిగితే బీమా వస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలన్న సీఎం.. కోటి 14 లక్షల ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చామని వివరించారు. రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని..గ్రామ సచివాలయాలతో ఆర్బీకేలను అనుసంధానించామన్నారు. ఆర్బీకే పరిధిలోని ఇ-క్రాపింగ్‌ డేటా ఆధారంగా పంట నష్టం వివరాలు తెలుసుకుంటున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి: సామాన్యులకు షాక్- మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర

Last Updated : Dec 15, 2020, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.