ETV Bharat / city

SEC: నీలం సాహ్ని నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ ఉపసంహరణ

author img

By

Published : Jun 24, 2021, 12:46 PM IST

ఎస్‌ఈసీ(SEC) నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్​ను.. పిటిషనర్ ఉపసంహరించుకున్నారు. పూర్తి స్థాయిలో పత్రాలు లేనందున వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు తెలిపారు. పూర్తి స్థాయి పత్రాలతో మరోసారి పిటిషన్‌ దాఖలుకు అనుమతివ్వాలని హైకోర్టును కోరారు.

pil on sec
pil on sec

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని(SEC Neleam sahni)ని నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని.. పిటిషనర్ మూర్తి ఉపసంహరించుకున్నారు. దీంతో పిటిషన్​ను డిస్పోజ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. పూర్తిస్థాయిలో పత్రాలు లేనందున వ్యాజ్యాన్ని ఉపసహరించుకుంటున్నానని.. పూర్తి స్థాయి పత్రాలతో మరోసారి పిటిషన్‌ దాఖలుకు అనుమతివ్వాలని హైకోర్టును కోరారు. అందుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది.

ఇదీ చదవండి: AP EXAMS: పరీక్షల సమయంలో మూడో వేవ్ వస్తే.. ఏం చేస్తారు?: సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.