ETV Bharat / city

అర్ధరాత్రి సర్కులర్​ ఇవ్వాల్సిన అవసరం ఏముంది: బండి సంజయ్​

author img

By

Published : Dec 4, 2020, 7:19 AM IST

ఎస్‌ఈసీ జారీచేసిన సర్కులర్‌పై న్యాయపోరాటం చేస్తామని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. గ్రేటర్​ ఎన్నిక రోజున సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పోలింగ్‌ శాతం పెరగటంపై అనుమానాలు ఉన్నాయన్నారు.

what-is-required
what-is-required

అర్ధరాత్రి సర్కులర్​ ఇవ్వాల్సిన అవసరం ఏముంది: బండి సంజయ్​

తెలంగాణ గ్రేటర్ ఎన్నికల రోజు సాయంత్రం 5 నుంచి 6 వరకు పోలింగ్​ శాతం పెరగడంపై తమకు అనుమానాలున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అనుమానం వ్యక్తం చేశారు.

అర్దరాత్రి వేళ సర్కులర్​ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎన్నికల కమిషనర్​ను ప్రశ్నించారు. ఓట్ల లెక్కింపును అడ్డుకోబోమని.. సర్కులర్​పై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

అర్ధరాత్రి సమయంలో ఎన్నికల కమిషనర్​ సర్కులర్​ జారీ చేశారు. బ్యాలెట్​లో స్వస్తిక్​ గుర్తు సహా ఏ మార్కు ఉన్నా లెక్కించాలని ఆదేశాలిచ్చారు. కేవలం కౌంటింగ్​ అధికారులకు మాత్రమే ఆదేశాలిచ్చారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపల గ్యాంబ్లింగ్​ జరిగింది.

-బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీచూడండి: పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.