ETV Bharat / city

3 రోజుల పాటు... రాష్ట్రానికి వర్ష సూచన

author img

By

Published : Oct 21, 2019, 6:07 PM IST

ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 23న దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రాంలో వర్షాలు పడే అవకాశం ఉందని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.

weather-updates-in-ap

మూడ్రోజులపాటు రాష్ట్రానికి వర్షసూచన

ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 23న దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు తెలియజేసింది. ఆ ప్రభావంతో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అప్రమత్తం చేసింది. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా... శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.