ETV Bharat / city

రస్ అల్​ ఖైమా లేఖపై సీఎం స్పందించాలి: వర్ల రామయ్య

author img

By

Published : Feb 19, 2020, 1:03 PM IST

సీఎం జగన్‌ను అప్పగించాలని కేంద్రానికి రస్‌ అల్‌ ఖైమా లేఖ రాసిందని వర్ల రామయ్య వెల్లడించారు. ఈ విషయంపై తమకు సమాచారం ఉందన్నారు. లేఖ రాసిందా లేదా అన్నదానిపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.

varla ramayya press meet fr cm hjagan in vijayawada
రస్ అల్​ ఖైమా లేఖపై సీఎం స్పందించాలి: వర్ల రామయ్య

రస్ అల్​ ఖైమా లేఖపై సీఎం స్పందించాలి: వర్ల రామయ్య

సీఎం జగన్‌ను తమకు అప్పగించాలని కోరుతూ.. కేంద్ర ప్రభుత్వానికి రస్‌ అల్‌ ఖైమా లేఖ రాసినట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలుగుదేశం నేత వర్ల రామయ్య చెప్పారు. ఈ విషయంపై సీఎం జగన్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. తమ డబ్బును జగన్ నుంచి వసూలు చేయటంతోపాటు జగన్‌నూ అప్పగించాలన్నదే ఆ లేఖ సారాంశమని వర్ల తెలిపారు. 7 నెలల క్రితం సెర్బియా పోలీసులు.... నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేశారని గుర్తు చేశారు. రసల్‌ ఖైమా సంస్థ ఇచ్చిన సొమ్మును... జగన్‌కు సంబంధించిన వివిధ సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్లుగా నిమ్మగడ్డ ప్రసాద్‌ అక్కడి పోలీసులకు వెల్లడించారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

'సెలెక్ట్ కమిటీపై ఛైర్మన్​ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.