ETV Bharat / city

తెలంగాణలో కుప్పకూలిన రెండతస్తుల భవనం.. నలుగురు మృతి

author img

By

Published : Apr 29, 2022, 6:56 PM IST

Updated : Apr 29, 2022, 7:49 PM IST

కుప్పకూలిన రెండతస్తుల భవనం
కుప్పకూలిన రెండతస్తుల భవనం

18:55 April 29

YADADRI: శిథిలాల కింద చిక్కుకున్న నాలుగు కుటుంబాలు

యాదగిరిగుట్టలో కుప్పకూలిన రెండతస్తుల భవనం

Building Collapsed in Yadagirigutta: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో రెండతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. కుప్పకూలిన భవనంలో నివాస గృహాలు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. కాగా కూలిన రెండతస్తుల భవనాన్ని.. 30 ఏళ్ల క్రితం కట్టారని స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి: గుంటూరు ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి ఉరిశిక్ష ఖరారు..

Last Updated : Apr 29, 2022, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.