కరోనా వ్యాప్తి దృష్ట్యా డ్రైవింగ్ లైసెన్సు పరీక్షలు తాత్కాలికంగా నిలిపివేస్తూ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. రేపట్నుంచి మే 31 వరకు ఎల్ఎల్ఆర్లు, కొత్తగా డ్రైవింగ్ లైసెన్సులు పొందేందుకు పరీక్షల స్లాట్ లను నిలుపుదల చేస్తూ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లోని కార్యాలయాలకు రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్నవారు ఇతర తేదీలకు స్లాట్ మార్చుకునే వెసులుబాటును రవాణా శాఖ కల్పించింది. అన్ని సేవలూ అన్లైన్లో aprtacitizen.epragathi.org లో పొందుపరచినట్లు రవాణాశాఖ వెల్లడించింది. ప్రజలు కార్యాలయాలకు రాకుండా నేరుగా వెబ్సైట్లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. రవాణా వాహనాలకు త్రైమాసిక పన్నును ఈ నెల 30 వరకు చెల్లించే వెసులుబాటు ఉన్నప్పటికిీ.. కరోనా దృష్ట్యా జూన్ 30 వరకు పొడిగించినట్లు ప్రకటించారు.
ఇవీ చదవండి: