ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11AM

author img

By

Published : Jan 3, 2022, 11:00 AM IST

.

ప్రధాన వార్తలు @ 11AM
ప్రధాన వార్తలు @ 11AM

  • సచివాలయ సిబ్బంది చేతివాటం.. పింఛన్​లో వెయ్యి రూపాయల కోత!

కొత్తగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించారు. పింఛన్​ పుస్తకాన్ని అందించాలంటే 1000 రూపాయలు చెల్లించాలంటూ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • PARITALA SRIRAM: 'వంగవీటి రాధా జోలికొస్తే ఊరుకోం..'

PARITALA SRIRAM: వంగవీటి రాధా జోలికొస్తే ఊరుకునేది లేదని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ అన్నారు. ఆయనను కాపాడుకునేందుకు ఏమైనా చేస్తామన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్​కు 3 వేల ఎకరాలే!

కర్నూలు జిల్లాలో నిర్మించబోతున్న ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్​కు కేటాయించే భూమిపై రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ముందుకా అనుకున్నట్లు ఒకేసారి 10 వేల ఎకరాలు కేటాయించకుండా... విడతల వారీగా కేటాయించాలని చూస్తోంది. అందులో భాగంగానే ముందుగా 3 వేల ఎకరాలను కేటాయించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Your Desi Cart: అవసరమే ఆ తల్లీకూతుళ్లను వ్యాపారవేత్తలను చేసింది!

మన వాళ్లు విదేశాల్లో స్థిరపడినా.. చాలామంది కావాల్సిన వస్తువులు, దుస్తులను ఇక్కడి నుంచే తెప్పించుకుంటారు. దానికి ఎవరో ఒకరు సాయం చేస్తారు. మరి అలా చేయడానికి వాళ్లకు వీలు కాకపోతే... ఇదే సమస్యని ఎదుర్కొంది సత్య ప్రియాంక! అవసరమే సృజనాత్మకతకు ఆధారమని నమ్మే తను దీనికో పరిష్కారాన్నీ కనిపెట్టింది. అదే.. యువర్‌ దేశీకార్ట్‌. తల్లితో కలిసి ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పుడు ఎన్నో దేశాల్లో తెలుగు వారికి సేవలందిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 33,750 మందికి వైరస్​

India covid cases: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 33,750 కేసులు నమోదయ్యాయి. 123 మంది మరణించారు. ఆదివారం 23,30,706 మందికి టీకాలు అందించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • తల్లి చనిపోతే పట్టించుకోని కొడుకులు.. కూతుళ్లే ఆ 'నలుగురి'గా మారి..

Daughters Carry Mother's Body: బతికి ఉన్నప్పుడు తల్లిని ఎలాగూ పట్టించుకోలేదు ఆ కొడుకులు. కనీసం ఆమె చనిపోయిన తర్వాత కూడా అంత్యక్రియలు నిర్వర్తించేందుకు వెనుకాడారు. దాంతో.. ఆమె నలుగురు కూతుళ్లే పాడె మోసి, అంతిమసంస్కారాలు పూర్తి చేసిన ఈ ఘటన ఒడిశాలో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Work From Home Benefits: గృహమే మేలిమి కార్యక్షేత్రం

ఇంటి నుంచి పనిచేయడం యాజమాన్యాలకు, ఉద్యోగులకు ఉభయ తారకంగా ఉంటుందని అధ్యయనాలు చాటుతున్నాయి. ఈ పద్ధతిలో సంస్థలకు ఉత్పాదకత పెరగడం, వ్యవస్థాగత ఖర్చులు తగ్గి పెట్టుబడి ఆదా కావడం వంటి ప్రయోజనాలున్నాయని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ పరిశోధనలో తేలింది. ఇంటి నుంచి పనిచేసే (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) పద్ధతి తాత్కాలిక ప్రత్యామ్నాయంగా ప్రారంభమైనప్పటికీ, సౌలభ్యత కారణంగా వివిధ దేశాలు దానికి చట్టబద్ధతను కల్పిస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Gold price today: ఏపీ, తెలంగాణలో భారీగా తగ్గిన బంగారం ధర

దేశంలో బంగారం ధర రూ.1,160 మేర దిగొచ్చింది. వెండి ధర కూడా రూ.300 తగ్గింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మాట నిలబెట్టుకున్న బీసీసీఐ.. ఆ క్రికెటర్ల ఖాతాలో డబ్బులు!

కరోనా వల్ల మ్యాచ్​లు జరగక ఆర్థికంగా ఇబ్బంది పడిన దేశవాళీ క్రికెటర్లకు పరిహారం చెల్లించడం ప్రారంభించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ కన్నుమూత

Director died: ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్​బాబు తదితరులతో అద్భతమైన సినిమాలు తీసిన డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి.. మరణించారు. పలువురు నటీనటులు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.