ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 1PM

author img

By

Published : Dec 4, 2021, 1:02 PM IST

Top news
Top news

.

  • rosaiah passes away: రేపు కొంపల్లి ఫామ్​హౌస్​లో రోశయ్య అంత్యక్రియలు
    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) కన్నుమూశారు. ఈ ఉదయం ఇంట్లో పల్స్‌ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్​లోని స్టార్‌ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు కొంపల్లిలోని ఫామ్​హౌస్​లో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్​ నేత కేవీపీ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Justice N. V. Ramana: 'ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ సరైన వేదిక'
    Justice N. V. Ramana: కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ అభిప్రాయపడ్డారు. కోర్టులకు వచ్చేముందే తక్కువ సమయంలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారాలు చేసుకోవచ్చని సూచించారు. హైదరాబాద్​లో జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం సన్నాహక సదస్సులో జస్టిస్ ఎన్.వి. రమణ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • jawad cyclone effect: ఉప్పాడ తీరంలో అలల ఉద్ధృతి.. బీచ్​రోడ్డులో రాకపోకలు నిలిపివేత!
    తుపాను ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఉప్పాడ తీరంలో కెరటాల్ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు బీచ్‌రోడ్డు మీదుగా రాకపోకలను నిలిపివేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • farmers padayatra: తిప్పవరప్పాడు వద్ద రైతుల మహాపాదయాత్రకు ఘన స్వాగతం
    amaravathi farmers padayatra in gudur: రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర.. 34వ రోజైన నెల్లూరు జిల్లా గూడూరులో సాగుతోంది. పాదయాత్ర వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం నుంచి ప్రారంభమై.. గూడూరు నియోజకవరం పుట్టంరాజువారి కండ్రిగ వద్ద ముగియనుంది. సుమారు 11కిలో మీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • JAWAD CYCLONE: తుపాను కారణంగా పోటీ పరీక్షలు వాయిదా
    cyclone effect: రాష్ట్రంలో తుపాన్ కారణంగా రైళ్ల రద్దు, పాఠశాలల బంద్​తో పాటు... జాతీయ పరీక్షల విభాగం నిర్వహించే యూజీసీ-నెట్ పరీక్షను కూడా వాయిదా వేశారు. ఎపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్​లో పరీక్షలు ఎప్పుడు నిర్వహించబోయేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 5లక్షల ఏకే-203 రైఫిల్స్​ తయారీకి భారత్​ గ్రీన్​ సిగ్నల్​
    Ak 203 rifle Indian army: 5లక్షలకుపైగా ఏకే-203 రైఫిల్స్​ తయారీకి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఉత్తర్​ప్రదేశ్​లోని అమేఠీలో వీటిని తయారు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఉక్రెయిన్​పై దండయాత్రకు రష్యా ప్రణాళిక- అమెరికా హెచ్చరిక!
    Russia offensive Ukraine: ఉక్రెయిన్​పై సైనిక చర్యలకు రష్యా రంగం సిద్ధం చేస్తోందని అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. సరిహద్దుల్లో లక్షలాది మంది సైనికులను పంపించేందుకు పుతిన్​ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలిపాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఘాటుగా స్పందించారు. రష్యాను ఎట్టిపరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
    Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర భారీగా పెరిగింది. వెండి ధర కాస్త వృద్ధి చెందింది. ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • IND vs SA series: భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ వాయిదా
    IND vs SA series: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన టీ20 సిరీస్ వాయిదా పడింది. ప్రస్తుత పర్యటనలో కేవలం వన్డే, టెస్టు సిరీస్ మాత్రమే జరుగుతుందని బీసీసీఐ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పూర్తిగా కోలుకున్న కమల్​​.. ఆస్పత్రి నుంచి డిశార్జ్​
    kamal haasan corona virus: కరోనా బారిన పడిన దిగ్గజ నటుడు కమల్​హాసన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు.​ ఆస్పత్రి నుంచి డిశార్చ్​ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.