ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 1PM

author img

By

Published : Dec 1, 2021, 12:59 PM IST

Top news
Top news

.

  • amaravathi farmers padayatra in nellore: ప్రచార రథాలను అడ్డుకున్న పోలీసులు..రోడ్డుపై అమరావతి రైతుల బైఠాయింపు
    amaravathi farmers padayatra in nellore: అమరావతి రైతుల మహాపాదయాత్ర.. నేడు నెల్లూరు జిల్లా మరుపూరు నుంచి ప్రారంభమైంది. 31వ రోజుకు చేరుకున్న పాదయాత్ర.. మరిపల్లి వద్ద ముగియనుంది. అయితే పాదయాత్రలో క్రైస్తవ, ముస్లిం ప్రచార రథాలను.. పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర వెంట వెళ్లరాదంటూ నిలిపివేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • VIJAYAWADA CP: విజయవాడ కొత్త సీపీగా పాలరాజు బాధ్యతలు
    Palaraju as Vijayawada CP: విజయవాడ కొత్త సీపీగా పాలరాజు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీపి శ్రీనివాసులు పదవీ విరమణ చేయడంతో పాలరాజు బాధ్యతలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Mopadu Reservoir: మోపాడు రిజర్వాయర్‌కు లీకులు.. 5 గ్రామాలకు ముప్పు!
    Mopadu Reservoir: ప్రకాశం జిల్లా పామూరు మండలం మోపాడు రిజర్వాయర్‌ కట్ట కింది భాగం నుంచి నీరు లీకవుతోంది. దీంతో చుట్టుపక్కల ఐదు గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Woman suicide: పుట్టింటిని మరవలేక.. అత్తారింటికి వెళ్లలేక.. నవవధువు ఆత్మహత్య
    అనంతపురంలో తల్లిదండ్రులను వదిలి అత్తింటికి వెళ్లలేక.. ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఉన్నత చదువులు చదివి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కూతురు బెంగతో ఉరి వేసుకోవడాన్ని జీర్ణించుకోలేక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • భీమా-కోరెగావ్ కేసులో సుధా భరద్వాజ్​కు బెయిల్​
    భీమా-కోరెగావ్​ కేసులో నిందితురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్​కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. సుదా భరద్వాజ్​కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Omicron In India: ఆ దేశ ప్రయాణికులకు ఏడు రోజుల క్వారంటైన్
    Omicron In India: ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావిత దేశాలనుంచి వచ్చే ప్రయాణికులు ఏడురోజులపాటు క్వారంటైన్​లో ఉండటాన్ని తప్పనిసరి చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • కొవిడ్​ మాత్ర​ వినియోగానికి అమెరికా ఎఫ్​డీఏ సానుకూలం!
    Covid pill merck: కొవిడ్​ ఔషధం మోల్నూపిరవిర్​ వినియోగంపై అమెరికా ఫుడ్​ అండ్ డ్రగ్స్​ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్​డీఏ)కు చెందిన ఆరోగ్య సలహాదారుల కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. గర్భిణులు ఈ ఔషధాన్ని వినియోగిస్తే శిశువులు పుట్టుకతో వచ్చే లోపం వంటి సమస్యలు ఎదుర్కోలేదని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • LPG Cylinder Price: వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్​ ధర!
    LPG Cylinder Price: కమర్షియల్ గ్యాస్ సిలిండర్​ ధర మరోసారి పెరిగింది. 19 కేజీల వాణిజ్య సిలిండర్​ ధర రూ. 100.50 పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఈ ధరలు నేటినుంచే(బుధవారం) అమల్లోకి వచ్చాయని పేర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • csk captain 2022: ధోనీ తర్వాత సీఎస్కే కెప్టెన్​ అతడే!
    ravindra jadeja chennai super kings: ధోనీ తర్వాత ​రవీంద్ర జడేజా చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు కెప్టెన్​గా వ్యవహరిస్తాడని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా మాజీ ఆటగాడు రాబిన్​ ఉతప్ప. చెన్నై జట్టు తర్వాతి కెప్టెన్‌కు కావాల్సిన అన్ని లక్షణాలు జడేజాలో ఉన్నాయని, అతడు గొప్ప ఆటగాడని కితాబిచ్చాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'తెలుగు పరిశ్రమకు చివరి సాహితీ దిగ్గజం సిరివెన్నెల'
    Sirivennela death chiranjeevi: సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంతో మంచి మిత్రుడిని కోల్పోయానని అగ్రనటుడు చిరంజీవి అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చివరి సాహితీ దిగ్గజంగా ఆయన చిరకాలం నిలిచిపోతారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.