ETV Bharat / city

SCHOOL TIMINGS: 'పాఠశాలల పని వేళల్లో మార్పు లేదు'

author img

By

Published : Aug 20, 2021, 9:06 AM IST

school timings
పాఠశాలల పని వేళల్లో మార్పు లేదు

రాష్ట్రంలో పాఠశాలల పని వేళల్లో మార్పు లేదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు.

పాఠశాలల పని వేళల్లో మార్పు లేదని, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో మాట్లాడారని చెప్పారు. అన్ని పాఠశాలలు ఎప్పటిలాగే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కొనసాగుతాయని మంత్రి తెలిపారని వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఇదీ చదవండి

Fevers: రాష్ట్రంలో పెరుగుతున్న మలేరియా, డెంగీ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.