ETV Bharat / city

కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి నిరాకరించిన కోర్టు

author img

By

Published : Aug 17, 2020, 10:42 PM IST

స్వర్ణ పాలెస్​ ఘటనలో అరెస్ట్​ అయిన ఆస్పత్రి సిబ్బంది ముగ్గురిని కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు పిటిషన్​ను విజయవాడ కోర్టు డిస్మిస్ చేసింది. నిందితుల బెయిల్​ పిటిషన్​ విచారణను 21కి వాయిదా వేసింది.

Swarna Palace fire accident
Swarna Palace fire accident

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనలో అరెస్ట్ అయిన ఆసుపత్రి సిబ్బంది ముగ్గురిని కస్టడీ కోరుతూ పోలీసులు విజయవాడ కోర్టులో వేసిన పిటిషన్​పై విచారణ జరిపింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం కస్టడీకి ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్​ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది.

మరోవైపు నిందితులు వేసిన బెయిల్ పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం 21వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో రమేష్ ఆసుపత్రి ఎండీ ఎనిమిదో అదనపు జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.


ఇదీ చదవండి

ఊహించని ఉపద్రవం.... బాధితుల్ని ఆదుకోండి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.