ETV Bharat / city

తెలంగాణ: కరోనా మృతుని కడసారి చూపునకు కూడా రాని కుటుంబ సభ్యులు

author img

By

Published : Jul 27, 2020, 3:03 PM IST

కరోనా అయినవాళ్లనూ.. దూరం చేసింది. మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారి మృతదేహాలు చూడటానికి సైతం… కుటుంబసభ్యులు రావడం లేదు. ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కొవిడ్ బారిన పడి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి అతని కుటుంబ సభ్యులు కానీ…బంధువులు కానీ ఎవరూ ముందుకు రాలేదు.

telangana: family members do not even come to see died corona patient
తెలంగాణ: కరోనా మృతుని కడసారి చూపుకు కూడా రాని కుటుంబ సభ్యులు

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఐసోలేషన్​ కేంద్రంలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. నిన్న రోగికి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ తీశారు. దాదాపుగా కరోనా అనే అనుమానంతో బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అక్కడికి రాగానే ఆక్సిజన్ స్థాయి పడిపోవడం వల్ల చనిపోయాడు. అయితే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూడటానికి సైతం రాకపోవడం మానవత్వానికి మచ్చగా నిలిచింది. శనివారం రాత్రి నుంచి మృతదేహాం మార్చురీలోనే ఉంది. ఈ ఘటనతో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

telangana: family members do not even come to see died corona patient
తెలంగాణ: కరోనా మృతుని కడసారి చూపుకు కూడా రాని కుటుంబ సభ్యులు

ఆదివారం రాత్రి 8.30 గంటలకు బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో మృతి చెందిన తర్వాత అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడానికి వైద్య సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా కుటుంబ సభ్యులు రాలేదు.

కరోనాతో మృతి చెందిన రోగిని ఎక్కడ ఖననం చేయాలోనని వైద్యశాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

ఇవీ చదవండి: అచ్చెన్న బెయిల్ పిటిషన్​పై వాదనలు.. తీర్పు రిజర్వు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.