ETV Bharat / city

KCR Meeting With Ministers : మంత్రులతో కొనసాగుతున్న సీఎం కేసీఆర్‌ సమావేశం

author img

By

Published : Mar 25, 2022, 8:28 PM IST

కేసీఆర్​
కేసీఆర్​

KCR Meeting With Ministers : తెలంగాణ రాష్ట్ర మంత్రులతో ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. దిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్​లో సీఎం సమావేశమయ్యారు. గురువారం రోజున దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​తో చర్చల సారాంశాన్ని మంత్రులు కేసీఆర్​కు వివరించనున్నారు.

KCR Meeting With Ministers : రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. దిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్​లో సీఎం సమావేశమయ్యారు. గురువారం రోజున దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​తో చర్చల సారాంశాన్ని మంత్రులు కేసీఆర్​కు వివరించనున్నారు. అనంతరం ధాన్యం కొనుగోళ్లపై కార్యాచరణ పట్ల చర్చిస్తారు.

ఈ భేటీ తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి వెళ్లనున్నారు. నూతన సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. పనుల్లో పురోగతిపై అధికారులను ఆరా తీస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.