ETV Bharat / city

గవర్నర్​ ప్రసంగంతో.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

author img

By

Published : Mar 15, 2021, 1:11 PM IST

telangana assembly sessions started
తెలంగాణ: గవర్నర్​ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసెంబ్లీ సమావేశ మందిరంలో ప్రసంగించారు. కాసేపట్లో సభాపతి, మండలి చైర్మన్ అధ్యక్షతన బీఏసీ సమావేశం కానుంది.

తెలంగాణ: గవర్నర్​ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశ మందిరానికి చేరుకున్న గవర్నర్​ను స్పీకర్​ పోచారం, సీఎం కేసీఆర్, మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి ఘనంగా స్వాగతించారు. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు.

కాసేపట్లో సభాపతి, మండలి చైర్మన్ అధ్యక్షతన బీఏసీ సమావేశం కానుంది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేయనుంది. సమావేశాలను 2 వారాలపాటు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించింది. మంగళవారం రోజు ఉభయసభల్లోనూ... నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య మరణంపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.

గురువారం రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నారు. ఈ నెల 18న ఉదయం 11.30 గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశముండగా... 20 నుంచి బడ్జెట్‌, పద్దులు, ఇతర అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి:

విశాఖ స్టీల్ ‌ప్లాంట్‌ మార్గంలో... 'ఉక్కు' ఉద్యోగుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.