ETV Bharat / city

'మద్య నిషేధం పేరిట.. దశలవారీ దోపిడీకి శ్రీకారం'

author img

By

Published : Oct 1, 2019, 5:45 PM IST

మద్యనిషేధం పేరిట దశలవారీ దోపిడీకి శ్రీకారం : పంచుమర్తి అనురాధ

దశలవారీ మద్య నిషేధం పేరిట దశలవారీ దోపిడీకి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెదేపా అధికారి ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. మద్య నిషేధం నాటకమన్న ఆమె... మద్యం మాఫియాను పోషించేందుకే నూతన విధానాలని విమర్శించారు.

మద్యనిషేధం పేరిట దశలవారీ దోపిడీకి శ్రీకారం : పంచుమర్తి అనురాధ
మద్య నిషేధం ముసుగులో జె-టాక్స్ పేరిట రూ.2 వేల కోట్ల దోపిడీకి జగన్‌ శ్రీకారం చుట్టారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. అమరావతిలో మాట్లాడిన ఆమె.. ప్రభుత్వం అమలు చేస్తోన్న మద్యపాన నిషేధం ఓ నాటకమని విమర్శించారు. పులివెందులలో మద్యం ఏరులై పారుతోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో 20శాతం మద్యం దుకాణాలు తగ్గించామని ప్రభుత్వం చెప్పటం హాస్యాస్పదమన్నారు. మద్యం మాఫియాను పెంచి పోషించేలా సర్కారు చర్యలు ఉన్నాయని అనురాధ ఆరోపించారు. రాష్ట్రంలో ఏ బ్రాండ్ మద్యం అమ్మాలో కేసీఆర్​ని అడిగి జగన్ నిర్ణయిస్తారని ఎద్దేవా చేశారు. దశలవారీగా మద్య నిషేధం పేరిట దశలవారీగా దోచుకునేందుకు ప్రణాళికలు చేసుకున్నారని ఆమె మండిపడ్డారు.

ఇదీ చదవండి :

మద్యం దుకాణం వద్దంటూ మహిళల ఆందోళన

Intro: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వెంకట చలపతి నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్న 9 మంది క్షతగాత్రులను పరామర్శించిన కాకినాడ ఎంపీ వంగా గీత ప్రమాదం జరగడం దురదృష్టకరం, ఎలా జరినిందనే దానిపై విచారణ జరుగుతోంది. 9 మంది గాయపడ్డారు, 6గురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.


Body: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వెంకట చలపతి నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్న 9 మంది క్షతగాత్రులను పరామర్శించిన కాకినాడ ఎంపీ వంగా గీత ప్రమాదం జరగడం దురదృష్టకరం, ఎలా జరినిందనే దానిపై విచారణ జరుగుతోంది. 9 మంది గాయపడ్డారు, 6గురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు


Conclusion: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వెంకట చలపతి నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్న 9 మంది క్షతగాత్రులను పరామర్శించిన కాకినాడ ఎంపీ వంగా గీత ప్రమాదం జరగడం దురదృష్టకరం, ఎలా జరినిందనే దానిపై విచారణ జరుగుతోంది. 9 మంది గాయపడ్డారు, 6గురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.