ETV Bharat / city

'కరోనా వ్యాప్తికి అధికారుల నిర్లక్ష్యమే కారణం'

author img

By

Published : Apr 26, 2020, 7:59 PM IST

అధికారుల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా మరణాలు పెరుగుతున్నాయని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. కర్నూలులో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.

tdp member and ex minister Bhuma Akhilapriya fire on governmrnt for stopping corona virus in kurnool
tdp member and ex minister Bhuma Akhilapriya fire on governmrnt for stopping corona virus in kurnool

'కరోనా పెరగడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం'

కర్నూలులో కరోనా కేసులు పెరుగుతుండడంపై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే మరణాలు పెరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. చనిపోయిన వారిని హైవే పక్కన పూడ్చిపెట్టి.. వస్తువులను అక్కడే వదిలేయటాన్ని తీవ్రంగా ఖండించారు. పాలకులు సీరియస్​గా లేరు కాబట్టే సిబ్బంది కరోనాను సీరియస్​గా తీసుకోవట్లేదని ఆరోపించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'కరోనా నుంచి కర్నూలును కాపాడండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.