ETV Bharat / city

Mahanadu: విదేశాల్లో అంగరంగ వైభవంగా.. తెదేపా మినీ మహానాడు

author img

By

Published : May 30, 2022, 8:51 PM IST

Updated : Jun 1, 2022, 4:15 PM IST

యూరప్ ఖండంలో "హైబ్రిడ్ మహానాడు" ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం శ్రేణులందరూ ఉత్సాహంతో ఉరకలు వేస్తూ అన్ని నగరాల నుంచి మహానాడు వేదికకు చేరుకున్నారు. డా.కిషోర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని.. విగ్రహావిష్కరణ చేశారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Mahanadu
Mahanadu

యూరప్ ఖండంలోని పలు దేశాల్లో మొట్టమొదటి సారిగా హైబ్రిడ్ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డా.కిషోర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని.. ఆయన విగ్రహావిష్కరణ చేశారు. ఈ వేదికను ఉద్దేశించి తెదేపా నాయుకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నక్కా ఆనంద్​బాబు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పంతగాని నర్సింహాప్రసాద్ తదితరులు వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివేక్ కరియావుల(నెదర్లాండ్స్), అమర్నాథ్(డెన్మార్క్), వేంకటపతి(నార్వే), ప్రముఖ్(ఐర్లాండ్), సుమంత్, దినేష్(మాల్టా), సతీష్(ఇటలీ), సాయి మౌర్య(హన్గేరి), ప్రవీణ్(పోలాండ్), శివకృష్ణ, కొండయ్య(బెల్జియం) తదితర నాయకులు పాల్గొని.. ప్రసంగించి పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు.

Last Updated : Jun 1, 2022, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.