ETV Bharat / city

విక్రమ్​ హత్యలో సీఐ భాగస్వామి- డీజీపీకి తెదేపా నేతల ఫిర్యాదు

author img

By

Published : Jul 1, 2020, 6:23 PM IST

తెలుగుదేశం నేతలు డీజీపీ గౌతం సవాంగ్​ను కలిశారు. గురజాలలో పార్టీ దళిత నేత విక్రమ్ హత్యకు సంబంధించి నేతలు ఫిర్యాదు చేశారు. హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెదిరింపులు, ప్రలోభాలతో ఎవర్నీ భయపెట్టలేరని అన్నారు.

tdp-leaders-meet-dgp-
tdp-leaders-meet-dgp-

వేధింపులకు గురిచేస్తున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని తెదేపా నేతలు హెచ్చరించారు. గురజాలలో విక్రమ్ హత్యపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు. అశోక్​బాబు, బచ్చల అర్జునుడు... విక్రమ్​ను విచారణ పేరుతో వేధించారని ఆరోపించారు.

మీడియాతో తెదేపా నేతలు

హైదరాబాద్​లో తలదాచుకున్న విక్రమ్​ను విచారణ పేరుతో పోలీసులు పిలిపించారని, స్థానిక సీఐ విక్రమ్​ను పదే పదే స్టేషన్​కు పిలిపించారని తెలిపారు. రోజు స్టేషన్ కు వస్తున్న విక్రమ్​ను ప్రత్యర్థులు కాపు కాసి హత్య చేశారని నేతలు మండిపడ్డారు. డీజీపీని కలిసి విక్రమ్ హత్యపై వాస్తవాలు అందించామని నేతలు తెలిపారు. హత్య కేసులో సీఐ భాగస్వామి అయ్యారని వేరే అధికారులతో విచారణ జరిపించాలని నేతలు డీజీపీని కోరారు.

ఇదీ చదవండి:

పేట వైకాపాలో పంచాయితీ... ఎంపీని అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.