ETV Bharat / city

అమరావతికి సీఎం జగన్ మరణ శాసనం రాశారు: పంచుమర్తి

author img

By

Published : Dec 15, 2020, 9:03 PM IST

Updated : Dec 15, 2020, 10:28 PM IST

సీఎం జగన్​పై తెదేపా ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏడాది కాలంగా అమరావతి మహిళలకు కడుపు నిండా తిండి...కంటిపై కునుకు లేకుండా చేశారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ ఫేక్ ఉద్యమాన్ని నడుపుతున్నారని ఆరోపించారు.

tdp-leader-panchumarthi-anuradha
tdp-leader-panchumarthi-anuradha

అమ్మలాంటి అమరావతికి సీఎం జగన్ మరణ శాసనం రాశారని తెదేపా ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. రాజధాని ప్రాంత మహిళలను వేధించడం మొదలుపెట్టి ఏడాది కావొస్తోందని విమర్శించారు. 3 రాజధానుల నిర్ణయంతో మహిళకు కడుపు నిండా తిండి లేదు..కంటిపై కునుకు లేదన్నారు. మహిళల ఆర్తనాదాలు జగన్మోహన్ రెడ్డికి వినిపించటం లేదా అని ప్రశ్నించారు. జగన్ ఇంట్లో లక్షల కొద్ది సూట్​కేసులు ఉంటే... ప్రజలపై లక్షల కేసులా అని నిలదీశారు.

జగన్మోహన్ రెడ్డి ఫేక్ ముఖ్యమంత్రి అని... మూడు రాజధానులకు మద్దతుగా ఫేక్ ఉద్యమం నడుపుతున్నారని విమర్శించారు. నకిలీ ఉద్యమానికి వైకాపా ఎమ్మెల్యేలు స్పాన్సర్ చేస్తున్నారన్నారు. ఎంపీ నందిగం సురేష్​కి సొంత గడ్డపై మమకారం లేదని దుయ్యబట్టారు. మహిళల ఆత్మాభిమానం కాపాడలేని జగన్​కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని స్పష్టం చేశారు. అమరావతి కోసం పోరాడుతున్న మహిళలకు తమ పార్టీ తరపున సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు.

తమ ప్రభుత్వం ఏం చేసినా ప్రజలు నమ్ముతారనే.. పిచ్చి ఆలోచనలు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మానుకోవాలని ఎమ్మెల్సీ అశోక్‌బాబు హెచ్చరించారు. దళితులపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే నిత్యం వారిపై ఎందుకు దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి

'ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేం'

Last Updated : Dec 15, 2020, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.