ETV Bharat / city

కరోనా నియంత్రణ కంటే ఎస్​ఈసీపైనే సీఎం దృష్టి: తెదేపా నేత చినరాజప్ప

author img

By

Published : Jul 24, 2020, 1:37 PM IST

Updated : Jul 24, 2020, 1:45 PM IST

ముఖ్యమంత్రి జగన్​కు కరోనాను నియంత్రించటం కంటే కొంత మంది అధికారులను వేధించటమే పనిగా పెట్టుకున్నారని తెదేపా నేత చినరాజప్ప విమర్శించారు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు.

tdp leader chinarajappa
tdp leader chinarajappa

సీఎం జగన్​కు కరోనా కంటే... ఎన్నికల కమిషనర్​ను తొలగించటం, కొంతమంది అధికారులను వేధించటం తప్ప మరో ధ్యాస లేదని మాజీ మంత్రి, తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. పేదల జీవనోపాధికి ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు. కరోనాపై పోరాటంలో ముందున్న డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పాత్రికేయులకు బీమా పాలసీ ఇవ్వాలని కోరారు. కొవిడ్​తో చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మద్యం దుకాణాలను నిలుపుదల చేయాలని సూచించారు.

ఇదీ చదవండి:

సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యల అంశంపై నేడు విచారణ

Last Updated : Jul 24, 2020, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.