ETV Bharat / city

చంద్రబాబు రాష్ట్ర పర్యటనపై సర్వత్రా ఆసక్తి

author img

By

Published : May 24, 2020, 11:14 AM IST

chandrababu
chandrababu

తెదేపా అధినేత చంద్రబాబు రేపటి రాష్ట్ర పర్యటన సర్వత్రా చర్చనీయాంశమైంది. రాష్ట్ర డీజీపీ నుంచి ఇంతవరకు అనుమతి రాకపోవటంపై పార్టీ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రేపటి చంద్రబాబు రాష్ట్ర పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ వెళ్లి గ్యాస్ లీకేజ్‌ బాధితులను పరామర్శించేందుకు...., తర్వాత రోడ్డుమార్గంలో అమరావతి వచ్చేందుకు అనుమతి కోరుతూ రెండు లేఖలు రాశారు. ఈ పర్యటనలకు తెలంగాణ, ఏపీ డీజీపీల అనుమతి కోరుతూ లేఖ రాశారు. తెలంగాణ డీజీపీ నుంచి వెంటనే అనుతి వచ్చింది. ఏపీ డీజీపీ నుంచి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. కొన్ని రోజుల క్రితం రోడ్డుమార్గంలో హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లేందుకూ అనుమతివ్వాలంటూ ఏపీ డీజీపీకి మరో లేఖ రాశారు. ఆ లేఖకి కూడా ఎటువంటి స్పందన రాలేదు.

ఇదీ చదవండి:

ప్రజలు కష్టాల్లో ఉంటే ఏడాది పాలన సంబరాలా..?: యనమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.