ETV Bharat / city

ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్​పై విచారణ.. ఏపీ ప్రభుత్వం, తెదేపాకు నోటీసులు

author img

By

Published : Oct 27, 2020, 2:52 PM IST

supreme court
supreme court

గుంటూరులో తెదేపా కార్యాలయానికి భూకేటాయింపుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వంతోపాటు తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది. సీఆర్డీఏ నిబంధనలు ఉల్లంఘిస్తూ తెదేపాకు భూమిని కేటాయించారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్​ దాఖలు చేశారు.

గుంటూరులో తెదేపా కార్యాలయానికి భూకేటాయింపుపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారించింది. ఏపీ ప్రభుత్వం, తెదేపాకు కోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం... 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. భూకేటాయింపులో సీఆర్‌డీఏ చట్టం నిబంధనలు ఉల్లంఘించారని ఈ పిటిషన్ దాఖలైంది. నీటివనరులతో సంబంధం ఉన్న భూమిని కేటాయిస్తూ 2017లో జీవో జారీ చేశారని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి

కొత్త జిల్లాల ఏర్పాటుపై.. జనవరి 26న ప్రకటన: కోన రఘుపతి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.