మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించిన అన్నను.. సోదరి రోకలిబండతో మోది హత్య చేసిన ఘటన తెలంగాణ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. సతీశ్ కుటుంబ సభ్యులతో కలిసి కూలీ పని చేసుకుంటూ జీవిస్తుండేవాడు. గురువారం ఉదయం నుంచి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సతీశ్ కుటుంబ సభ్యులతో మళ్లీ గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే సోదరిపై మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించాడు. చేసేదేమీలేక ఇంట్లో ఉన్న రోకలిబండతో అతని తలపై మోదీ హతమార్చింది. సంఘటనా స్థలాన్ని సీఐ లక్ష్మీ బాబు, ఎస్సై నాయుడు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: మానసిక ఒత్తిడితో వివాహిత ఆత్మహత్య