ETV Bharat / city

SCORPION FESTIVAL: ఆ రోజు.. వాళ్లంతా అదే చేస్తారు

author img

By

Published : Aug 14, 2021, 1:23 PM IST

corpion-festival-on-the-occasions-of-nagula-panchami
ఆ రోజు వాళ్లంతా అదే చేస్తారు..

నాగులపంచమి నాడు అందరూ పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. పాములకు పాలు పోస్తారు. కాని తెలంగాణలోని నారాయణపేట జిల్లా కందుకూర్‌లో మాత్రం అందుకు భిన్నంగా పండుగను నిర్వహిస్తారు. అక్కడి వారంతా తేళ్ల పంచమి జరుపుకుంటారు. ఎందుకలా చేస్తారంటే..?

తేళ్ల పంచమి

నాగులపంచమి వేళ అంతటా పుట్ట వద్ద పూజలు, పాలు పోసి నాగదేవతలు పూజిస్తుంటారు. కానీ తెలంగాణలోని నారాయణపేట జిల్లా కందుకూర్‌లో మాత్రం అందుకు భిన్నంగా పండుగ జరుగుతోంది. ఇక్కడి ప్రజలు పాములకు బదులు తేళ్ల పంచమి నిర్వహిస్తున్నారు. గ్రామ శివారులోని కొండపై తేళ్ల దేవత ఆలయం నిర్మించి.. విగ్రహాలకు పాలు పోసి తేళ్ల పంచమి జరుపుకుంటున్నారు. తేళ్లను చేతిలోకి తీసుకుని ఆటలాడుతున్నారు. ఒకవేళ తేలు కుట్టినా ఆలయంలోని విభూతి రాస్తే తగ్గిపోతుందని ఇక్కడి ప్రజల విశ్వసిస్తున్నారు.

తేళ్ల దేవత ఆలయం నారాయణపేట పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కందుకూరు గ్రామ శివారులోని కొండమవ్వ గుట్టపై ఉంది. గుట్టపై ఉన్న ఏ రాయిని తీసినా తేళ్లు ప్రత్యక్షమవుతాయి. నాగుల పంచమి రోజున పిల్లలు, పెద్దలు తేళ్ల గుట్టపైకి వెళ్లి... ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం రాళ్ల కింద ఉన్న తేళ్లను ముట్టుకుంటారు. ఈ సందర్భంగా అవి ఎలాంటి హాని చేయవని వారి నమ్మకం. ఒకవేళ తేలు కుట్టినా ఆలయంలోని విభూతిని రాస్తే తగ్గిపోతుందని విశ్వసిస్తుంటారు. ఏటా నాగుల పంచమి రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని అనుమతించడం లేదని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి: తెలంగాణలోని రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో జాప్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.