ETV Bharat / city

డోలు వాయిద్యాల నడుమ గద్దెపైకి సారలమ్మ

author img

By

Published : Feb 6, 2020, 1:36 AM IST

తెలంగాణ కుంభమేళా అయిన మేడారం మహాజాతర తొలి రోజు క్రతువు వైభవంగా ముగిసింది. గిరిజన సంప్రదాయ పద్ధతిలో సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెపైకి చేరుకున్నారు.

saralamma-goddes
డోలు వాయిద్యాల నడుమ గద్దెపైకి సారలమ్మ

డోలు వాయిద్యాల నడుమ గద్దెపైకి సారలమ్మ

మేడారం మహా జాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై ఆసీనులయ్యారు. గిరిజన సాంప్రదాయబద్ధంగా పూజారులు ప్రత్యేక పూజలు చేసి గద్దెల మీద ప్రతిష్ఠించారు. పూజల అనంతరం పూజారులు బయటకు వెళ్లారు. అమ్మవారి ఆగమనంతో భక్తులు పరవశించిపోయారు.

గద్దెలపై ప్రతిష్ఠిచే సమయంలో... ప్రధాన ద్వారాలు మూసి భక్తులను నిలిపివేశారు. గద్దెలపైకి చేరుకున్నట్లు సూచనగా విద్యుత్ దీపాలు ఆర్పివేశారు. ఉత్సవాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి: రేపు మేడారానికి గవర్నర్ తమిళిసై​, సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.