ETV Bharat / city

Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్​ టూర్​ షెడ్యూల్​..!

author img

By

Published : Feb 4, 2022, 8:57 AM IST

Modi Hyderabad Tour
Modi Hyderabad Tour

Modi Hyderabad Tour: తెలంగాణలోని ముచ్చింతల్​ శ్రీరామనగరానికి రానున్న ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్​ ప్రాథమికంగా ఖరారైంది. శనివారం సాయంత్రం 7 గంటలకు సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్​ పర్యటన షెడ్యూల్​ ప్రాథమికంగా ఖరారైంది. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​లోని సమతామూర్తి విగ్రహ లోకార్పణ చేసేందుకు వస్తున్న మోదీ.. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్​లో ముచ్చింతల్​లోని శ్రీరామనగరానికి రానున్నారు. హెలిపాడ్​లో దిగిన తర్వాత సమీపంలోని అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ సుమారు 10 నిమిషాలపాటు రీప్రెష్ అవుతారు. అనంతరం నేరుగా యాగశాలకు వస్తారు. యాగశాలలో సాయంత్రం 6 గంటలకు పెరుమాళ్లను దర్శించుకొని విశ్వక్ సేనుడి పూజ చేస్తారు.

సరిగ్గా 7 గంటలకు..

అనంతరం సమతామూర్తి కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ నిర్మించిన 108 దివ్యదేశాలతోపాటు భద్రవేది మొదటి అంతస్తులోని స్వర్ణమయ సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుంటారు. సుమారు అరగంటపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం భద్రవేది మూడో అంతస్తులో 216 అడుగుల రూపంలో కొలువుదీరిన సమతామూర్తి విగ్రహానికి త్రిదండి చినజీయర్​ స్వామితో కలిసి పూజచేస్తారు. అనంతరం సరిగ్గా 7 గంటలకు సమతామూర్తి విగ్రహన్ని జాతికి అంకితమివ్వనున్నారు. సమతామూర్తి విగ్రహం చెంతనే సుమారు అరగంట పాటు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

మోదీకి 5 వేల మంది రుత్వికుల వేద అశీర్వచనం..

అనంతరం మోదీ సమక్షంలోనే రామానుజచార్యుల విగ్రహంపై 15 నిమిషాలపాటు 3డీ లైటింగ్ ప్రదర్శిస్తారు. ఆ ప్రదర్శనను మోదీ ఆసాంతం తిలకిస్తారు. అక్కడి నుంచి మరోసారి యాగశాలకు చేరుకొని ఆరోజు నిర్వహించిన శ్రీలక్ష్మీనారాయణ యాగానికి పూర్ణాహుతి పలకనున్నారు. ఈ సందర్భంగా 5వేల మంది రుత్వికులు ప్రధాని మోదీకి వేద అశీర్వచనం ఇస్తారు. అయితే పరిస్థితులకు అనుగుణంగా ఈ షెడ్యూల్​లో మార్పులు జరగవచ్చని నిర్వాహకులు తెలిపారు.

ఇదీచూడండి: Statue of Equality Inauguration Celebrations : వైభవంగా రెండోరోజు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.