ETV Bharat / city

PANJAGUTTA RAPE CASE: ఆఫీసుకు రమ్మన్నాడు.. ఆ తర్వాత..

author img

By

Published : Dec 10, 2021, 10:45 PM IST

PANJAGUTTA RAPE CASE: ఆఫీసులో పని ఉందని పిలిచి నర్సుపై అత్యాచారానికి పాల్పడిన నిందితున్ని హైదరాబాద్​లోని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మల్లెల సాయిని రిమాండ్​కు తరలించారు. నిందితుడు తెలంగాణలోని మేడ్చల్ జిల్లా నాగోలుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

PANJAGUTTA RAPE CASE
పంజాగుట్టలో నర్సుపై అత్యాచారం

PANJAGUTTA RAPE CASE: హైదరాబాద్​లో నర్సుపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితున్ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ హెల్త్​కేర్​ సర్వీస్​లో నర్సుగా పనిచేస్తున్న మహిళపై మేడ్చల్ జిల్లా నాగోలుకు చెందిన మల్లెల సాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏపీలోని విజయవాడలో ఓ పేషంట్​ కోసం అత్యవసరంగా కార్యాలయానికి రమ్మనాడు. ఆమె ఆఫీసుకు వెళ్లగానే.. మేడ మీద ఉన్న తన గదిలోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఘటనకు సంబంధించి బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.

Nurse Raped at Hyderabad: బాధితురాలికి ఇదివరకే వివాహం కాగా.. కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుందని పోలీసులు తెలిపారు. బాధితురాలు ప్రస్తుతం పంజాగుట్టలోని ద్వారకాపూరి కాలనీలోని ఓ ప్రైవేట్​ హెల్త్​ కేర్​ సర్వీస్​లో నర్సుగా పని చేస్తోంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్​కు తరలించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.