ETV Bharat / city

'అమరావతి రైతుల కష్టం చూసి మనసు చలించింది'

author img

By

Published : Jan 1, 2020, 2:48 PM IST

ntr son ramakrishna supports amaravathi farmers
అమరావతి రైతులకు రామకృష్ణ మద్దతు

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ.. ఎర్రబాలెంలో రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. అన్నదాతల కష్టం చూసి తన మనసు చలించిందంటూ కంటతడి పెట్టుకున్నారు. తన కుటుంబమంతా ఈ పోరాటానికి అండగా ఉంటుందని చెప్పారు.

అమరావతి రైతులకు రామకృష్ణ మద్దతు

రైతుల కష్టాలు చూసి తన మనసు చలించిందని ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ ఆవేదన చెందారు. తెదేపా అధినేత చంద్రబాబు దంపతులతో కలిసి.. ఎర్రబాలెంలో రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. రైతులు ఆవేదన చూసే.. బయటకు వచ్చి మాట్లాడుతున్నట్టు చెప్పారు. తన కుటుంబం తరఫున వారికి పూర్తి మద్దతు తెలుపుతున్నానని.. చెప్పారు. చంద్రబాబు ఎప్పుడూ అమరావతి కోసం తపించేవారన్నారు. ఇప్పుడు సీఎం జగన్ మూడు రాజధానులంటూ... రైతుల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చారని ఆవేదన చెందారు. రైతుల పరిస్థితి చూసి బాధగా ఉందంటూ కంటతడి పెట్టుకున్నారు.

ఇవీ చదవండి:

'ప్రజా సేవకుడిగా పనిచేశా.. అభివృద్ధి చేశా..!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.