ETV Bharat / city

అమరావతి పరిరక్షణ సమితికి ప్రవాసాంధ్రులు విరాళం

author img

By

Published : Jan 31, 2020, 1:54 PM IST

Nris have given fund to amaravathi jac
అమరావతి పరిరక్షణ సమితికి ప్రవాసాంధ్రులు విరాళం

అమరావతి కోసం రైతన్నలు చేస్తున్న ఉద్యమానికి ప్రవాసాంధ్రులు తమవంతు సాయం అందించారు. అమెరికా న్యూజెర్సీకి చెందిన ప్రవాసాంధ్రులు రూ.7.76 లక్షలను అమరావతి పరిరక్షణ సమితి సభ్యులకు అందజేశారు. ఈ చెక్​ను తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు చేతుల మీదుగా ఐకాస నేతలకు ఇచ్చారు.

అమరావతి పరిరక్షణ జేఏసీకి అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ప్రవాసాంధ్రులు రూ.7.76 లక్షలను సాయంగా అందజేసి సంఘీభావం తెలిపారు. నాట్స్‌ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన్‌ కృష్ణ ఆధ్వర్యంలో ‘న్యూజెర్సీ అమరావతి జేఏసీ’ తరఫున కొసరాజు విజయబాబు, చింతపల్లి ప్రతాప్‌, రవి తదితరులు గురువారం ఎన్‌టీఆర్‌ భవన్‌లో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేతుల మీదుగా చెక్కును జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి, కార్యదర్శి తిరుపతిరావు, అధికార ప్రతినిధి శ్రీనివాసరావులకు అందజేశారు. అమరావతి రాజధానిగా కొనసాగేలా జేఏసీ పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని మన్నవ తదితరులు సూచించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన పలువురు రూ.4 లక్షలు, ఒంగోలు ఫ్రెండ్స్‌ గ్రూప్‌ సభ్యులు రూ.1.41 లక్షల విరాళమిచ్చారు. దామరచర్ల జనార్దన్‌ ఆధ్వర్యంలో వారంతా ఎన్‌టీఆర్‌ భవన్‌లో చంద్రబాబుకు ఈ మొత్తాన్ని అందజేశారు. చంద్రబాబును కలిసిన వారిలో జొన్నల గడ్డ మంజూష, చిలకమ్మ, సుబ్బరత్నమ్మ తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి : మహాత్ముని సంకీర్తనలతో.. అమరావతి ఉద్యమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.