ETV Bharat / city

New Districts: కొత్త జిల్లాలపై ఉత్కంఠ.. నేడు ఉన్నతస్థాయి సమావేశం

author img

By

Published : Mar 30, 2022, 5:37 AM IST

Updated : Mar 30, 2022, 10:42 AM IST

new districts in ap: కొత్త జిల్లాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై సీఎం జగన్ నేడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు...కొత్త జిల్లాల్లో వడివడిగా పనులు జరుగుతున్నాయి. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కావాలన్న ప్రభుత్వ నిర్దేశం మేరకు.. అధికారులు పనులు వేగవంతం చేశారు.

new districts
new districts

విశాఖ పోర్టు ట్రస్టు జీసీబీ గేట్ వద్ద మత్స్యకారుల నిరసన

new districts in ap : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై..ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన నేడు ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లపై.. ఈ సమావేశంలో స్పష్టత రానుంది. కొత్త రెవిన్యూ డివిజన్ల ఏర్పాటుకు..సీఎం సుముఖంగానే ఉన్నారని సమాచారం. అయితే ఒక నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలను.. వేర్వేరు జిల్లాల్లోకి మార్చడంపై సందిగ్ధత నెలకొందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై విస్తృతంగా చర్చించి ఉగాది ముందు రోజు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముందని సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు దగ్గర పడుతుండటంతో ప్రతిపాదించిన జిల్లాల్లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ప్రభుత్వం నుంచి ఒకట్రెండు రోజుల్లో ప్రకటన వెలువడనుండటంతో అప్పటికల్లా ఏర్పాట్లు పూర్తి చేసేలా అధికారులు శ్రమిస్తున్నారు.

బాపట్ల కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లా కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 6 నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతో పాటు మరికొన్ని ప్రధాన శాఖల కార్యాలయాల కోసం భవనాలు ముస్తాబవుతున్నాయి. బాపట్ల కేంద్రంగా ఏర్పాటుకాబోతున్న కొత్త జిల్లా కోసం ఇప్పటికే అనేక భవనాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్‌ ఎండ్ బీ విభాగం ఆధ్వర్యంలో భవనాల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు మరమ్మతులు చేయిస్తున్నాం. బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కోసం ఎప్పటి నుంచో ప్రతిపాదనలున్నాయి. అది ఇప్పటికి కార్యరూపం దాల్చుతోంది. బాపట్ల కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు కావటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కేంద్రంగా ఏర్పడనున్న మన్యం జిల్లాకు ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాలు గుర్తించి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. I.T.D.A.నూతన భవనంలో ఏర్పాటు కాబోతున్న కలెక్టరు, జేసీ, సీఈవో కార్యాలయాల్లో 80శాతం పనులు పూర్తయ్యాయి.

పెనమలూరు, పామర్రు నియోజకవర్గాలతో ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లగా... ఆయన మంజూరు చేశారని ఎమ్మెల్యే పార్థసారథి ప్రకటించారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ కొత్త రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ఏర్పాటుపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. మరోవైపు.. జిల్లాల పునర్విభజన ప్రక్రియపై ఆయా ప్రాంతాల్లో స్థానికుల నుంచి అభ్యంతరాలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. మొత్తానికి ఈ రోజు సీఎం జగన్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశంలో మార్పులు, చేర్పులు, కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశముంది.

ఇదీ చదవండి: new districts : వడివడిగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ... జోరుగా వసతుల కల్పన

Last Updated : Mar 30, 2022, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.