ETV Bharat / city

రైతాంగాన్ని ఆదుకోవాలంటూ సీఎంకు లోకేశ్ లేఖ

author img

By

Published : Dec 14, 2020, 7:29 PM IST

సీఎం జగన్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. వరుస విపత్తులతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆరు డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Lokesh_Letter_To_CM
Lokesh_Letter_To_CM

ఈ నెలాఖారులోగా విపత్తులతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. ఒక్క ఖరీఫ్ సీజన్​లోనే 10వేల కోట్ల పంటలు దెబ్బతిని రైతులు కుదేలయ్యారని అన్నారు. ఈ మేరకు సీఎం జగన్​కు లేఖ రాశారు. వ్యవసాయ పంటలకు హెక్టారుకు రూ.30వేలు, ఉద్యాన పంటలకు రూ.50వేలు చెల్లించాలన్నారు. పంట నష్టాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.

పంటల బీమా చెల్లింపు సక్రమంగా అమలయ్యేలా చూడాలని లేఖలో కోరారు. వర్షాలకు దెబ్బతిన్న మొత్తం పంటను ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలని సూచించారు. వరుస విపత్తులతో పంటలు తీవ్రంగా నష్టపోయినా రైతులను ఆదుకునే ఎలాంటి చర్యలు ప్రభుత్వం చేపట్టలేదని మండిపడ్డారు.

ఇదీ చదవండి

పోలవరం ఎత్తు ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గదు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.