ETV Bharat / city

గ్రూప్-1 అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్​కు నారా లోకేశ్ లేఖ

author img

By

Published : May 15, 2021, 8:29 PM IST

సీఎం జగన్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. గ్రూప్-1 అభ్యర్థుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని అందులో కోరారు. భౌతిక మూల్యాంకణం కోసం రూపొందించిన జవాబు పత్రాలను.. డిజిటల్ పద్ధతిలో చేయడంపై పునరాలోచించాలన్నారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు ఆన్​లైన్​ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

nara lokesh letter to cm jagan
సీఎం జగన్​కు నారా లోకేష్ లేఖ

nara lokesh letter to cm jagan
సీఎం జగన్​కు నారా లోకేష్ లేఖ

ఏపీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిజిటల్ మూల్యాంకణం అనేక అనుమానాలకు తావిస్తున్నందున.. వాటన్నిటినీ నివృత్తి చేసి సాంకేతికతపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ... సీఎం జగన్​కు లేఖ రాశారు. గ్రూప్-1 ద్వారా ఎంపికైన అభ్యర్థులు సబ్ కలెక్టర్లుగా, ఆర్డీవోలుగా, ఇతర ఉన్నతాధికారులుగా సేవలందించాల్సి ఉన్నందున.. లోపాలు, పక్షపాతం లేకుండా పరీక్షా విధానం న్యాయంగా ఉండటం ఎంతో ముఖ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: దిల్లీ, కేరళలో కరోనా కేసులు తగ్గుముఖం

గత విధానాలకు విరుద్ధంగా అభ్యర్థుల ఎంపిక, మూల్యాంకణం ఉన్నాయని.. అవి ఆయా అభ్యర్థులకు శాపం కాకూడదని లోకేశ్ లేఖలో పేర్కొన్నారు. భౌతిక మూల్యాంకణం కోసం రూపొందించిన జవాబు పత్రాలను.. డిజిటల్ పద్ధతిలో చేయడం వల్ల అర్హులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వచ్చే నెలలో ఇంటర్వ్యూ రౌండ్ ప్రారంభం కానున్నందున.. అభ్యర్థుల డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

ఎంపికైన అభ్యర్థుల పేర్లతో పాటు మార్కులను బహిర్గతం చేయాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల అభ్యర్థులు తమ లోపాలను సరిచేసుకునేందుకు వీలు కలగడంతో పాటు తదుపరి ప్రయత్నాలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఎంపిక కాని వారి మార్కులు, జ‌వాబు ప‌త్రాల‌ను విడుదల చేయాలన్నారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు ఆన్​లైన్​ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాను సాకుగా చూపి చట్టపరమైన పద్ధతుల్ని విస్మరించొద్దని సూచించారు.

ఇదీ చదవండి:

'ఎంపీ రఘురామ ఒంటిపై గాయాలు తాజావని తేలితే.. తీవ్ర పరిణామాలు' : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.