ETV Bharat / city

మద్యం అమ్మకాలకు క్యూ.. వ్యాక్సిన్ల కేంద్రాల వద్ద తోపులాటా?: లోకేశ్

author img

By

Published : May 8, 2021, 3:32 PM IST

Updated : May 8, 2021, 4:58 PM IST

సీఎం జగన్​పై విమర్శలు గుప్పించారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. అనారోగ్యానికి కారణమయ్యే మద్యం షాపుల ముందు క్యూలో ఉండేలా జాగ్రత్తలు చేపట్టిన ప్రభుత్వం.. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద మాత్రం చేతులెత్తేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ చేశారు.

corona cases in andhrapradesh
nara lokesh fiers on cm jagan

  • .@ysjagan కి త‌న సొంత బ్రాండ్ల మ‌ద్యం అమ్మ‌కం పై ఉన్న ఆరాటం.. ప్రజల ఆరోగ్యంపై లేక‌పోవ‌డం విచార‌క‌రం. తాగేవాడికి అనారోగ్యం, తాగించేవాడికి ఆదాయం వ‌చ్చే మ‌ద్యంషాపుల ముందు మందుబాబుల‌ను జాగ్ర‌త్త‌గా క్యూలలో పెట్టి, భౌతికదూరం పాటింప‌జేస్తోన్న జ‌గ‌న్‌రెడ్డి...(1/2) pic.twitter.com/GXK6np7Tza

    — Lokesh Nara (@naralokesh) May 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ముఖ్యమంత్రి జగన్ పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్​కి తన సొంత బ్రాండ్ల మద్యం అమ్మకాలపై ఉన్న ఆరాటం.. ప్రజారోగ్యంపై లేకపోవటం విచారకరమన్నారు.

మద్యం షాపుల ముందు క్యూ పెట్టి.. భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టారు కానీ.. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద మాత్రం చేతులెత్తేశారని దుయ్యబట్టారు. ఈ చర్యలతో కొవిడ్ వ్యాప్తికి కారణమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాకు జత చేశారు.

ఇదీ చదవండి:

కడప జిల్లా మామిళ్లపల్లె శివారులో పేలుడు.. 10కి చేరిన మృతుల సంఖ్య!

Last Updated : May 8, 2021, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.