ETV Bharat / city

KTR: కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడుతం: కేటీఆర్​

author img

By

Published : Jul 10, 2021, 3:32 PM IST

minister ktr react on krishna water disputes
కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితోనైనా కొట్లాడుతం: కేటీఆర్​

కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని.. తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామని.. చట్ట ప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామన్నారు.

కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామని.. తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామన్నారు. శనివారం నారాయణపేట జిల్లాలో మంత్రి పర్యటించారు. జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డును ప్రారంభించారు. నారాయణపేటకు 10 కి.మీ. దూరంలోనే కర్ణాటక ఉందని, ఆ రాష్ట్రంలో మన దగ్గర అమలవుతోన్న ఏ ఒక్క పథకమైనా అమలవుతుందా? అని ప్రశ్నించారు. రైతుబంధు, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు కర్ణాటకలో ఉన్నాయో.. లేవో చెప్పాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తాం

ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉందని కేటీఆర్ చెప్పారు. నారాయణపేటకు జలాలు రావాలంటే ప్రజాభిప్రాయ సేకరణకు రావాలన్నారు. ఎవరెన్ని రకాలుగా అడ్డుకున్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. నారాయణపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 3,400 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది తెరాస ప్రభుత్వమేనని తెలిపారు. నారాయణపేటలో పట్టణ ప్రగతి పనులు వేగంగా జరుగుతున్నాయని, నారాయణపేటలోనే 2100 విద్యుత్ స్తంభాలు, 19 ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేశామని కేటీఆర్​ చెప్పారు.

ఇదీ చదవండి:

CM Jagan visiting Polavaram: ఈ నెల 14న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.