ETV Bharat / city

తెలంగాణ: ఎమ్మెల్సీ ఎన్నికల ఓటుహక్కు నమోదుకు నేడు తుదిగడువు

author img

By

Published : Feb 13, 2021, 12:29 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటుహక్కు నమోదుకు ఈరోజే చివరిరోజు. తెలంగాణలో మార్చి 14న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

last-day
last-day

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటుహక్కు నమోదుకు నేటితో గడువు ముగియనుంది. మార్చి 14న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల స్థానంతో పాటు వరంగల్ - నల్గొండ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఫిబ్రవరి 23 గడువుగా ఈసీ నిర్ణయించింది. ఈనెల 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 26 వరకు గడువుగా నిర్ణయించారు. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు. మార్చి 22వరకు ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ పూర్తికానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.